బేగంపేట్ డిసెంబర్ 30: జనవరి 2 నుంచి సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్టు మాజీ మంత్రి ,సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గం పరిధిలోని ఆరు డివిజన్లలో గల బస్తీలు, కాలనీలలో పర్యటించి చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటామని వివరించారు. బస్తీలు, కాలనీల పర్యటనలో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.