హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారు సార్.. అని నేడు లబ్ధిదారులు
అడుగుతున్నారు. వారి ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు దాటినా నేటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. తులం బంగారం కోసం లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారని ఇప్పటికైనా వారి ఆశలను నెరవేర్చాలన్నారు.