బేగంపేట్ ఫిబ్రవరి 20 : ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామని మాజీ, మంత్రి సనత్నగర్(Sanathnagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(
MLA Talasani) అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్లోని పీజీ రోడ్డులో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను స్థానికులు తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా డిమ్మీ పాన్షాపు నుంచి రామ మందిరం వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశామని, త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు, స్థానిక నాయకులు కిశోర్, శ్రీహరి, ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.