బేగంపేట్ డిసెంబర్ 20 : ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇక నియోజకవర్గం పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani) తెలిపారు. బుధవారం సనత్నగర్ డివిజన్లోని మోడల్ కాలనీ అల్లావుద్దీన్ కోటి, రాజరాజేశ్వరి నగర్, అశోక్ కాలనీ, జెక్ కాలనీలకు చెందిన పలువురు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్రెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల ముందు ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఇటీవల నూతనంగా ఎన్నికైన సనత్నగర్లోని జెక్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ను వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసం వద్ద మార్యద పూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదే విధంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు మల్లు ప్రసాద్, జనరల్ సెక్రటరీ రాజశేఖర్, చందు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.