హైదరాబాద్ : చిరు వ్యాపారుల(Small traders )పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. మోండా మార్కెట్(Monda market) డివిజన్ పాలికా బజార్, బండి మెట్ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40, 50 సంవత్సరాల నుంచి వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు,
ప్రజలు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అలాగే పోలీసులు కూడా చిరు వ్యాపారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఫుట్పాత్లను ఆక్రమించుకోకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేసుకోవాలన్నారు.