బన్సీలాల్పేట్, డిసెంబర్ 26 : పద్మారావునగర్(Padmarao Nagar)లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani ) అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అక్కడక్కడ నెలకొన్న సమస్యలు సైతం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పద్మారావునగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాల్రెడ్డి, కార్యదర్శి చక్రధర్ యాదవ్, జీకే.నాయుడు, కృష్ణారావు, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత, బీఆర్ఎస్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్లు అయనను కలిశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన తలసానికి అభినందనలు తెలిపారు.