ఎల్బీనగర్ , మార్చి 27 : ట్రాఫిక్ చిక్కులు లేకుండా పుట్పాత్లపై వ్యాపారాలు చేసుకోవాలని, ట్రాఫిక్కు (Traffic) ఇబ్బంది కలిగితే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. చైతన్యపురి మెట్రో స్టేషన్ పరిసరాల్లో పండ్ల వ్యాపారాలు చేసుకునే వారు తమను వ్యాపారం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ రోడ్డుపై ఇబ్బందులు కలిగే విధంగా ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా పుట్పాత్పై వ్యాపారాలు చేస్తే పోలీసులు అడ్డుకుంటారని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా వ్యాపారాలు చేసుకుంటే మందిదని అన్నారు. ఈ విషయంలో తాను ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.