హైదరాబాద్ : ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ మంచినీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం హయత్నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో దాదాపు రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వేర్వేరుగా శంకుస్థాపనలు చేశారు.
హుడాసాయినగర్లో సీసీ రోడ్డు, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, కమలానగర్లో ఎస్డబ్ల్యు డ్రెయిన్, శారదానగర్ కమ్యూనిటీ హాల్ నందు కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి, సీసీ రోడ్లు, నారాయణ జూనియర్ కళాశాల నుంచి బీసీ హాస్టల్ వరకు, మైనార్టీస్ సంక్షేమ కళాశాల వరకు, నరసింహారావు నగర్లోని జ్ఞాన సరస్వతి పాఠశాల వరకు, మైత్రీ అనుంబంధ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అలాగే ఇంజాపూర్ రోడ్డు నుంచి సీతారాంపురం కాలనీ వరకు, సిటీ మోడల్ స్కూల్ నుంచి అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ వరకు, పద్మాలయ కాలనీ నందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి రంగంలో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పద్మాలయ కాలనీ అధ్యక్షుడు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.