మన్సూరాబాద్, ఫిబ్రవరి 12: పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి( CM relief fund) ఎంతో తోడ్పాటునందిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి లలితానగర్కాలనీకి చెందిన లావణ్య వెన్నుముఖ సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకుంది.
వెన్నుముఖ ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ. 1.50 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. సదరు ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పాటి చిరంజీవి, సత్యంచారి తదితరులు పాల్గొన్నారు.