వనస్థలిపురం, జూన్ 11 : కాలనీల్లో ఎక్కడా ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. మంగళవారం వనస్థలిపురం డివిజన్ క్రిస్టియన్ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలో జరుగుతున్న వర్షపునీటి పైప్లైన్ పనులను( Pipeline works) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంత వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
గతంలో క్రిస్టియన్ కాలనీలో ఎంతో వరద సమస్య ఉండేదని అది లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. కాలనీలో నూతనంగా సీసీ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు రఫీ, ప్రజ్ఞ, కాలనీవాసులు పాల్గొన్నారు.