మన్సూరాబాద్, అక్టోబర్ 6: ఆటోనగర్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ఇసుక లారీల అడ్డా వలన పదిహేను సంవత్సరాలుగా సుమారు ఇరవైరెండు కాలనీల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మోక్షం లభించింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పలు దఫాలుగా అక్కడి ప్రాంతంలో పర్యటించి స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మొక్కవోని పట్టుదలతో శ్రమించి ఇసుక లారీల అడ్డా తరలింపునకు పూనుకున్నారు. దుమ్ము, దూళితో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుండటాన్ని గమనించిన ఆయన ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక లారీల అడ్డాను అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక లారీల అడ్డాను తొలగించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు.. ఇసుక లారీలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న లారీ యజమానులు, ఇసుక వ్యాపారస్తులతో పాటు కూలీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పని చేశారు. ఇసుక లారీల అడ్డాను వేరే ప్రాంతానికి తరలించే విషయంపై ఒకవైపు లారీ అసోసియేషన్ సభ్యులతో చర్చిస్తూనే మరో వైపు వారికి న్యాయం జరిగే విధంగా.. ఇసుక లారీల అడ్డాను కొత్తగా ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాన్ని వెతకడం ప్రారంభించారు.
లారీల అడ్డా ఏర్పాటు కోసం పలుమార్లు టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో చర్యలు జరిపారు. సమస్య తీవ్రతను టీఎస్ఐఐసీ అధికారులకు వివరించి ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇసుక లారీ అడ్డా కోసం కేటాయింపజేశారు. ఇటు కాలనీలవాసులకు, లారీ అసోసియేషన్ సభ్యులను ఏక తాటిపైకి తీసుకువచ్చిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఇసుక లారీల అడ్డాను ఇతర ప్రాంతానికి తరలించారు. అందరి అంగీకారంతో శుక్రవారం ఉదయం 5:30 గంటలకు పై ఉన్న ఇసుక లారీల అడ్డాను టీఎస్ఐఐసీకి చెందిన 12 ఎకరాల స్థలంలోకి మార్చే ప్రక్రియను ప్రారంభించారు. ఇసుక లారీల అడ్డా తొలగింపు సందర్భంగా అక్కడి చేరుకున్న సుమారు 22 కాలనీల ప్రజలు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఏండ్ల తరబడిగా తాము పడుతున్న కష్టాలకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి నాయకత్వాన్ని మరోసారి బలపరుస్తామని రాబోయే ఎన్నికల్లో ఆయనకు మద్దతు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నవీన్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, సామ తిరుమల్రెడ్డి, హయత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్గౌడ్, జేఏసీ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇసుక లారీల అడ్డా తొలగింపు సందర్భంగా లారీ అసోసియేషన్ సభ్యులకు, కాలనీల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తీసుకున్నారని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బూడిద నందారెడ్డి తెలిపారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. మూడు నెలలుగా ఇసుల లారీల అడ్డా తొలగింపు విషయంపై కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు, లారీ అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపారని తెలిపారు. ఇసుక లారీల అడ్డా తొలగింపు వలన లారీ అసోసియేషన్ సభ్యులకు ఇబ్బందులు కలుగకుండా స్థానికంగానే ఉన్న టీఎస్ఐఐసీకి చెందిన స్థలంలోనే లారీలను నిలుపుకొని యథావిధిగా వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కేసారం బాల్రెడ్డి, సుర్వి యాదయ్యగౌడ్, బూడిద రాంరెడ్డి, ఆటోనగర్ ఇసుక లారీ ఐలా యజమానుల సంఘం అధ్యక్షుడు సుర్వి రాజుగౌడ్, ఎండీ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
చంపాపేట, అక్టోబర్ 6: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. చంపాపేట డివిజన్ పరిధిలోని యాదగిరినగర్ కాలనీ రోడ్డు నిర్మాణం, చంపాపేట ఓల్డ్ విలేజీ, శ్రీనిధికాలనీలో ఎస్సీ శ్మశానవాటికలో మౌలిక వసతుల కల్పన, చంపాపేట కుమ్మరి బస్తీలో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం, కటికోనికుంట బస్తీలో డ్రైనేజీ విస్తరణ పనులు, నెహ్రూనగర్ కాలనీ, కటికోనికుంట బస్తీ, సామ సరస్వతి కాలనీ, న్యూ పద్మానగర్, బైరమాల్గూడ ప్రగతినగర్, దుర్గాభవానీ నగర్లో రోడ్లకు మరమ్మతులు, మాధవనగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ప్రగతినగర్లో డ్రైనేజీ పైపులైన్ల విస్తరణ రూ.6.20కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, ఆలయ ధర్మకర్తలు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు గజ్జల మధుసూదన్రెడ్డి, సుంకోజు కృష్ణమాచారి, రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్, బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, మహిళా వింగ్ అధ్యక్షురాలు శాగ రోజారెడ్డి, ఎల్బీనగర్ యూత్వింగ్ అధ్యక్షుడు రవిముదిరాజ్, నాయకులు చేగోని మల్లేశ్ గౌడ్, ఎలిమినేటి నిషికాంత్రెడ్డి, గూడూరు గౌతంరెడ్డి, డేరంగుల శ్రీనాథ్, ఆనగొంది జంగయ్య, కొత్తపేట ప్రభాకర్, గోపాల్ముదిరాజ్, అనసూయ, మాల్పటేల్ వసంతరెడ్డి, రజినీరెడ్డి, లక్ష్మి, కవిత, ఉష, రమాదేవి, అంభిక, బాలకృష్ణ, బొంబాయి తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్, అక్టోబర్ 6: నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిద్దుతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కామేశ్వర్రావు కాలనీ, సాయినగర్ కాలనీ, సంఘమేశ్వర అపార్ట్మెంట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్ రోడ్డు, అల్తాఫ్నగర్, విజయపురికాలనీ, న్యూ శివపురికాలనీ, లక్ష్మీనారాయణకాలనీ, కాకతీయ కాలనీల్లో రూ.3.31కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యకారులు, పలు విభాగాల కమిటీల సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.