ఎల్బీనగర్, జూలై 21 : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం చైతన్యపురి డివిజన్ ద్వారకాపురం కాలనీకి చెందిన లింగమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 58 వేల చెక్కును ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి దోహదపడుతుందని అన్నారు. ఈ పథకం పేదలకు ఓ వరంలాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ యువజన అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, జలేందర్, కిరణ్, మిట్టు, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్, జూలై 21 : తెలంగాణలో ఆపన్నులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. బుధవారం కొత్తపేటలోని తన నివాసంలో చైతన్యపురికి చెందిన వర్ధన్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 24 వేల చెక్కును ఎమ్మెల్సీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అధునాతన వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి అందుకు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకులు శరత్ చంద్ర, వరుణ్చంద్ర, అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.