బొల్లారం, ఆగస్టు 7 : బంగారు తెలంగాణలో భాగంగా రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న విజ్ఞిప్తి చేశారు. శనివారం కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం సెయింట్ ఆన్స్ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడం వల్ల అవి పెరిగి తిరిగి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించి మన ప్రాణాలను కాపాడుతాయన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యుడు లోక్నాథ్, స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టిర్ జూలీ సాంటో, పాఠశాల కరస్పాడెంట్ మేరీ జోసెఫ్, మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్, నళిని కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, మురళీయాదవ్, చందర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.