బడంగ్పేట, జనవరి13: మహేశ్వరం నియోజక వర్గ ప్రజలందరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి వెలుగు మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తుందని భగవంతుడిగని ప్రార్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాలనీ అసోసియేషన్ నాయకులకు, కుల సంఘాల నాయకులకు, ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.