హైదరాబాద్ : పేదలకు అండగా ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన కీర్తన అనారోగ్యానికి గురై నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. దవాఖాన ఖర్చుల నిమిత్తం సబితా ఇంద్రారెడ్డిని ఆశ్రయించడంతో ఆమె తక్షణమే రూ.లక్షా 50వేల ఎల్ఓసీ(LOC letter) లెటర్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడానికి తన వంతు సహకారం అందజేస్తానని చెప్పారు. పేదలకు అందాల్సిన పథకాలు ప్రభుత్వం నుంచి పొట్లాడి తీసుకవస్తానని వివరించారు. పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నిర్భయంగా తన వద్దకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొలను విజేశ్వర్రెడ్డి, మంగలి రమేష్ నాయీ, తదితరులు పాల్గొన్నారు.