మల్కాజిగిరి, మే 26 : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మల్కాజిగిరి(Malkajgiri) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు. ఆదివారం మచ్చ బొల్లారం డివిజన్ లాలాషా బస్తీ, తుర్కపల్లిలోని సమస్యలు పరిష్కరించాలని పలువురు నాయకులు ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రైనేజీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లవంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.
అధికారులతో సర్వే చేయించి నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తామని, నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధిపనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆతిక్పాషా, జావెద్, అఫ్జల్, సికిందర్, గౌసుద్దీన్, రషీద్, యాస్మిన్, ఇమ్రాన్, సాదిక్, ఆజాం, కాజాపాషా, మంద శోభన్బాబు, దేవా, ఈశ్వర్, వినోద్, కిట్టు, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.