శంషాబాద్ : ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ( Mla Prakash Goud) తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించిన సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేను సన్మానించారు. శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్యాదవ్, రాష్ట్ర ట్రెడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మిశ్రీ తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ జిల్లా మాజీ కార్యదర్శి రాచమల్ల సురేష్, పార్టీ నాయకుడు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.