మణికొండ, మార్చి 27 : దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్గా నిలిచిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గండిపేట మండలంలోని నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీల పరిధిలోని లబ్ధిదారులకు జీవో 58 కింద ఎంపికైన అర్హులకు ఇండ్ల పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సదర్భంగా గండిపేట మండలంలో 51మందికి ఇండ్ల పట్టాలు, 95 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ కిట్తో మొదలై కల్యాణలక్ష్మితో ఆడపిల్లలకు పెండ్లి చేసే వరకు కుటుంబ సభ్యులతో సమానంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటున్నదన్నారు. జీవో 58 కింద ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికి నిర్మాణాలకు పునాదిస్థాయి నుంచి నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ రాజశేఖర్, నార్సింగి మున్సిపల్ చైర్మన్ రేఖాయాదగిరి, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, కౌన్సిలర్లు కె.రామకృష్ణారెడ్డి, ప్రవీణ్కుమార్, ఉషారాణి, నాగపూర్ణ, అమరేందర్రెడ్డి, శ్రీకాంత్రావు, అరుణజ్యోతి, విజిత, యాదమ్మ, సునీత, శివారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్ ముదిరాజ్, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, సురేశ్గౌడ్, నర్సింహ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, నాయకులు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.