శంషాబాద్ రూరల్, మార్చి 4 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం శంషాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి,మిషన్భగీరథ, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలతో పాటు ఇటీవల కొత్తగా కంటి వెలుగును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ప్రజల అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు ప్రారంభిస్తే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన్నట్లు తెలిపారు.
మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన లక్ష్మయ్య రూ.60వేలు, ఆకాశ్కు రూ. 20వేలు, మల్కారం గ్రామానికి చెందిన యాదయ్యకు రూ. 39 వేలు, వీరేశ్కు రూ. 36వేలు, మహబూబ్కు రూ. 20వేలు, నర్కూడ గ్రామానికి చెందిన సురేశ్కు రూ. 60 వేలు, రషీద్గూడ గ్రామానికి చెందిన అమినాబేగానికి రూ. 20,500లు, చౌదర్గూడ గ్రామానికి చెందిన రాజుకు రూ. 60వేలు, ముచ్చింతల్ గ్రామానికి చెందిన నరేశ్కు రూ.18 వేలు, రాజుకు రూ.12,500 వేలు, పిల్లోనిగూడ గ్రామానికి చెందిన వెంకటేశ్కు రూ.18 వేలు, రూ. 3లక్షల 60వేల చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ దవాణాకర్ గౌడ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్రావు, సర్పంచ్ రాజ్కుమార్, నాయకులు యాదగిరిరెడ్డి, రాజశేఖర్గౌడ్, నరిసింహ, ముక్తార్, భిక్షపతి, శివశంకర్, రావేందర్, భిక్యానాయక్, చెన్నకేశవ్, రవి, రమేశ్, గడ్డం అశోక్యాదవ్, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
మైలార్ దేవ్ పల్లి ,మార్చి 4: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ,సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో అవసరమని ఎ మ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్ కాలనీలోని శ్రీ గాయత్రీ టెక్నో పాఠశాలలో ఏ ర్పాటు చేసిన ఎక్స్పో సెంట్రిక్ ది మ్యాజిక్ ఆఫ్ క్రియేటివిటి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నమూనా ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు రకరకాల సైన్స్ కు సంబంధించిన అంశాలను పరికరాలతో రూపొందించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మాట్లాడే తీరును చూసి ఉపాధ్యాయులను అభిందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మధుసూదన్ ,డైరెక్టర్లు స్వామి,విజయ్ ,శ్రీహరి,డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ ,సరికొండ వెంకటేశ్ ,కాశీగారి యాదగిరి,మధుబన్ కాలనీ అధ్యక్షుడు డీవీ కుమార్ ,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.