శంషాబాద్ రూరల్, మార్చి 14 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే తన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రజల అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు ప్రారంభిస్తే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్గూడ,ఊటుపల్లి, తొండుపల్లి,అహ్మద్నగర్,మెహిదిగార్డెన్, వీకర్కాలనీ, ఇంద్రారెడ్డి కాలనీలకు చెందిన పలువురికి చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ కోలన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండిగోపాల్యాదవ్, నార్సింగి మార్కెట్ చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్, కౌన్సిలర్లు అమృతరెడ్డి, శ్రీకాంత్యాదవ్, నాయకులు శ్రీనివాస్గౌడ్, ప్రవీణ్గౌడ్, పారేపల్లి శ్రీనివాస్గౌడ్,తాజ్బాబా,హన్ముంతు పాల్గొన్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 14 : పేదలకు సీఎంసహాయనిధి అండగా ఉం టుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో సులేమాన్నగర్ డివిజన్ ఇన్చార్జి షేక్ నయీమొద్దీన్ ఆధ్వర్యంలో ఆ కాలనీకి చెందిన బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సహనాజ్ ఫాతిమాకు రూ. 60 వేలు, ఎండీ జాంగీర్కు రూ.28వేలు, రెహనాబేగంకు రూ. 16, 500 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎండీ హు స్సేన్, షేక్ బాబా, ఎండీ ఫయాజ్ఖాన్, షేక్ సమీర్, జాఫర్, సురేశ్, రాజు , శ్రీను తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, మార్చి 14 : మండలంలోని సుల్తాన్ పల్లి గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రూ. 30 లక్షల నిధులు మంజూరు చేస్తూ పత్రాలను మంగళవారం స ర్పంచ్ దండుఇస్తారికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దండుఇస్తారి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి నిధు లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కోరడంతో వెంటనే స్పందించి మంజూరు చేశారని తెలిపారు. బీసీ గౌడ సంఘం భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు, రూ. 5లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబిదొడ్డి గ్రామంలో రూ.5 లక్షలతో సీసీరోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డికలకు దండుఇస్తారి కృతజ్ఞతలు తెలిపారు.