మణికొండ/బండ్లగూడ/మైలార్దేవ్పల్లి/అత్తాపూర్ నవంబర్ 9 : తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ విజయం కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీ 1వ వార్డు కౌన్సిలర్ వల్లభనేని అనిల్హై మాంజలి, చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ గురువారం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్ముదిరాజ్, మణికొండ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో వెయ్యి మంది అనుచరులతో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.