శంషాబాద్ రూరల్, మార్చి 3 : పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై గ్యాస్ ధరలు పెంచి మరోసారి నడ్డివిరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గణేశ్గుప్త, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు,వైస్ చైర్మన్ బండిగోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, కౌన్సిలర్లు జాంగీర్ఖాన్, కుమార్, అజేయ్,నాయకులు పాల్గొన్నారు.
బండ్లగూడ,మార్చి 3: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి గ్యాస్ ధరలను పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్ అన్నారు. శుక్రవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేశ్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ బండ్లగూడ చౌరస్తాలో మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మహేందర్గౌడ్ మాట్లాడుతూ వంట గ్యాస్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. తద్వారా నిరు పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రూ. 400 ఉన్న గ్యాస్ ధరను రూ.1150 వరకు పెంచారని మండి పడ్డారు. వెంటనే పెంచిన ధరలను తగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సాగర్గౌడ్, నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయిబాబాగౌడ్,లక్ష్మిబాయి,బీఆర్ఎస్ నాయకులు నాగరాజు, పాపయ్య యాదవ్,పాండు,సుమన్గౌడ్,రాజు,నవీన్,రాముడు యాదవ్,మలాకీరత్నం తదితరులు పాల్గొన్నారు.
మణికొండ,మార్చి3: మోదీ ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మణికొండ మున్సిపాలిటీ బీఎర్ఎస్ అధ్యక్షుడు శ్రీరాములు, ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీ ఆంధ్రాబ్యాంక్ సర్కిల్లో పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి కట్టెలపొయ్యిపై వంటచేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మోదీ పేదల నడ్డి విరుస్తూ బడా బాబుల జేబులు నింపుతున్నాడని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంత్ రావు,ఆలస్యం నవీన్ కుమార్ ,బీఆర్ఎస్వీ నాయకులు శ్రావణ్ ,మైనారిటీ నాయకుడు బషీర్ ,సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ ,జయరాజ్ ,లక్ష్మయ్య, శ్రీకాంత్ , రాఘవేంద్ర, రాజేంద్రప్రసాద్, భరత్ , గంగాధర్ ,తదితరులు పాల్గొన్నారు.