సికింద్రాబాద్, జులై9 : రాష్ట్రంలోని దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పెన్షన్స్ పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నేతలు అందె రాంబాబు, కొల్లి నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం బుధవారం సికింద్రాబాద్లోని పద్మారావు గౌడ్ నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు జరిపేలా ఓత్తిడి తేవాలని వారు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల డిమాండ్లు సహేతుకమేనని, వారి ప్రయోజనాలకు మద్దతుగా నిలుస్తామని పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతామన్నారు.