మల్కాజిగిరి, అక్టోబర్ 28: డబ్బులు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలను ముక్తకఠంతో ఖండిస్తున్నామని కార్పొరేటర్లు సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగదీశ్ గౌడ్, ఆకుల నర్సింగరావు, సర్కిల్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, జేఏసీ వెంకన్న, రాము యాదవ్ అన్నారు. శనివారం మల్కాజిగిరి డివిజన్ ఆర్కేనగర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, నాయకులకు చెప్పకుండా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగెస్ పార్టీలో చేరాడన్నారు.
డబ్బులు తీసుకున్నారని చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే కార్పొరేటర్ల పదవికి రాజీనామా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ కార్పొరేటర్లుగా టికెట్లు ఇచ్చారని, పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల క్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారని, డిపాజిట్ వస్తుందో రాదో తేల్చుకోవాలన్నారు. మా బలం బలగం చూసి హస్తం గుర్తు వారు బెంబేలెత్తి పోతున్నారని, బలవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి నాయకులను చేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదన్నారు. మలాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని, ప్రజలు అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.