గౌతంనగర్/ నేరేడ్మెట్, జనవరి 20 : తెలంగాణలో ‘కంటి వెలుగు’ అమలు సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మౌలాలి డివిజన్ పరిధి గాయత్రినగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కేంద్రాలకు వచ్చి ప్రజలు కంటి పరీక్షలు చేయించుకొని కంటి అద్దాలను పొందాలని కోరారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండి, కంటి చూపు సక్రమంగా ఉండాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఆర్కేహెచ్కాలనీలో రూ.20లక్షలు, గాయత్రినగర్కు రూ.15లక్షలు భూగర్భడ్రైనేజీ కోసం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జలమండలి ఎండీ దానకిశోర్ను ఫోన్లో సంప్రదించి నిధులను మంజూరు చేయించారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గాయత్రినగర్లో కమ్యూనిటీహల్, పార్కు అభివృద్ధి కోసం త్వరలోనే నిధులను మంజూరు చేయిస్తామని కాలనీవాసులకు, అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాయత్రినగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు లోహిత్రెడ్డి, జనార్దన్రెడ్డి, కోషాధికారి అనిల్, ఉపాధ్యక్షులు ఎండీ. యూసుఫ్, మైకేల్, వెంకట్రావు, శిర్డీసాయిబాబా దేవాలయ చైర్మన్ రాజేందర్రావు, గ్రీన్హిల్కాలనీ అధ్యక్షులు దశరథరెడ్డి, ఏఈ మాధురి, బీఆర్ఎస్ నాయకులు పిట్ల శ్రీనివాస్, జీఎన్వీ సతీష్కుమార్, అమీనొద్దీన్, ఎం. భాగ్యనందరావు, సత్తయ్య, ఆదినారాయణ, పూలపల్లి జగదీశ్యాదవ్, సంతోష్నాయుడు, శ్రీనివాస్రెడ్డి, చంద్రకాంత్, రాజు, జానీసాగర్, ఆకుల రామారావు, మురళీకృష్ణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మౌలాలి డివిజన్ పరిధి షఫీనగర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏఈ మధురిమను ఆదేశించారు. షఫీనగర్లో రెండు గల్లీలలో సీసీ రోడ్లు వేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. త్వరలోనే మిగతా రెండు గల్లీలలో సీసీ రోడ్లు వేయిస్తామని హమీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ మధురిమ, బీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, భాగ్యనందరావు, సత్తయ్య, ఎండీ.మదర్, వర్క్ఇన్స్పెక్టర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
పీబీ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మౌలాలి డివిజన్ పరిధి జీబీ కాలనీలో రూ.4లక్షలతో భూగర్భడ్రైనేజీ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు. కాలనీలో సీసీ రోడ్లను నిర్మించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకరావాలని వెంటనే సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం సునీల్కుమార్, మేనేజర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, భాగ్యనందరావు, సత్తయ్య, నవాబ్, గౌలికార్ శైలేందర్, గౌలికార్ దినేశ్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు అంజీరెడ్డి, బాలకృష్ణ, సందీప్ పాల్గొన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం నేరేడ్మెట్ డివిజన్ మెహర్బాబా కాలనీలో స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డి కాలనీ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి కాలనీలోని సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. అధికారులు వెంటనే పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కృష్ణమూర్తి, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్, ఉదయ్కుమార్, భాగ్యవతి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం వినాయక్నగర్ డివిజన్ వాజ్పేయినగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు రోజులపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శైలజ అధ్యక్షత వహించగా, కన్వీనర్గా డాక్టర్ ఎస్. రమేశ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు నూతన డిగ్రీ కళాశాలను నిర్మించి అన్ని హంగులతో అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించుటే లక్ష్యమని అన్నారు. ఇప్పటికే కళాశాలకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని, మంచినీటి సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ ఎస్ ఇంద్రకాంత్, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్రావు, కో కన్వీనర్ డాక్టర్ ఈ బ్రిజేస్, చంద్రయ్య, పి. రవీందర్ పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డితో కలిసి సీబీఎన్ కాలనీలో పర్యటించారు. స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్రెడ్డి, ఎస్.ఆర్. ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, రాంచందర్రావు, చెన్నారెడ్డి, శివ, రాజు, మహేశ్, రాజేశ్, నరేశ్, గిరి, నాగరాజు, నవీన్, శ్యామ్, కోటేశ్వరి, రేణుక, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.