చిక్కడపల్లి, ఫిబ్రవరి 13 : ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని సబర్మతినగర్ బస్తీలో సోమవారం హుస్సేన్ సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్ నాలా రిటర్నింగ్వాల్ నిర్మాణంతో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కవాడిగూడ గోషాల నుంచి గోల్నొక నాలా వరకు రిటర్నింగ్ వాల్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు 68.4 కోట్లతో జరుగుతున్న పనులు వేగవంతగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటీకే అరుంధతి నగర్, ధోబీఘాట్ బస్తీ, బాపునగర్, ఆశోక్నగర్ ప్రాంతాల్లో పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. మార్చి నెలాఖరులోగా పూర్తి అవుతాయని ఆయన వివరించారు. బస్తీకి సంబంధించిన కమ్యూనిటీ సమస్యలు పరిష్కారిస్తామని ఎమ్మెల్యే బస్తీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక బస్తీ నాయకుడు జీవై గిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, ముఠా జయసింహలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ ఏఈ శ్యామ్ సుందర్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్, నాయకలు ముఠా నరేశ్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్రావు, ముచ్చకుర్తి ప్రభాకర్, రవి శంకర్గుప్తా, బత్తుల కిరణ్కుమార్, స్థానిక బస్తీ నాయకులు సీవై గిరి, మహమ్మద్ యాసిన్, నర్సింగ్రావు ముదిరాజ్, ఎండీగౌస్, రాజు, చందు, నాయకులు వెంకటేశ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.