చిక్కడపల్లి,మే30: అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లో బాపునగర్, అరుంధతినగర్, సబర్మతినగర్, వాల్మీకి నగర్లో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న సాబాద్ ఫోర్గింగ్ పనులను మంగళవారం ఎమ్మెల్యే ముఠాగోపాల్, స్థానిక కార్పొరేటర్ పావని తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను శాశ్వతంగా పరిష్కారానికి తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నాలా పరీవాహక బస్తీ ప్రజలు సమస్య పరిష్కారం ప్రత్యేక దృష్టిసారస్తున్నామని తెలిపారు.
స్థానిక ప్రజలకు కోరిక మేరకే సాబాద్ స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ గీత, ఏఈ అబ్దుల్ సలామ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్కుమార్, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా నరేశ్, గుండు జగదీశ్ గుప్తా, రవి శంకర్ గుప్తా, పీఎస్ శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, గడ్డమీది శ్రీనివాస్, శ్రీకాంత్, పరుశురాం, బత్తులు కిరణ్, దేవయ్య, హన్మంతు, జీవై గిరి, జహంగీర్, శ్రీధర్రెడ్డి, ఎస్టీ ప్రేమ్, భాస్కర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎ.వినయ్కుమార్, రత్నసాయిచంద్, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల అభీష్టం మేరకే వార్డు కార్యాలయం..
గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్ కమ్యనిటీ హాల్లో ఏర్పాటు చేయనున్న వార్డు కార్యాలయాన్ని స్థానిక ప్రజల అభిష్టం మేరకు మరో ప్రాంతానికి తరలిస్తామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో వార్డు కార్యాలయం ఏర్పాటును స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీహాల్ను యధావిధిగా కోనసాగించాలని వారు కోరుతున్నారు. మంగళవారం డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే ముఠాగోపాల్ జవహర్నగర్ కమ్యూనిటీహాల్ విషయంపై మాట్లాడారు ప్రజల అబీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.