కవాడిగూడ/చిక్కడపల్లి, ఫిబ్రవరి 26: పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్లోని గంగపుత్ర సంఘంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ) స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన బీఆర్ఎస్ భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రభుత్వానికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ రవి, రాజేశ్ల నేతృత్వంలో దాదాపు 300 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎ. శంకర్ గౌడ్, ఉమాకాంత్ ముదిరాజ్, పబ్బ కృష్ణ, గోవింద్ రాజ్, కేఎం శంకర్, కృష్ణ, కేఎం సాయి, కళ్యాణ్, ప్రవీణ్, మహేష్, , హాజీ పాషా, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్లో..
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్కుమార్ అన్నారు. ఈస్ట్ మారేడ్పల్లి షెనాయ్ దవాఖాన ఆధ్వర్యంలో గాంధీనగర్లో జనప్రియ అబోడ్స్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దవాఖాన డైరెక్టర్ సురాజ్ ఉత్తమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో బీజేవైఎం నగర మాజీ అధ్యక్షుడు ఎ.పావని వినయ్కుమార్, మురళి,సంపత్ తదితరులు పాల్గొన్నారు.