చిక్కడపల్లి, జూలై17: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం గాంధీనగర్ డివిజన్లో సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. వరాల పోచమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమైన పాదయాత్ర టీఆర్టీ కాలనీ ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముఠా జైసింహ, ముఠా నరేశ్, వాటర్వ ర్క్స్ డీజీఎం చంద్రశేఖర్, ఎలక్ట్రిసిటీ ఎండీ హరీశ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, కార్యదర్శి శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, గుండు జగదీశ్ బాబు, రవి శంకర్గుప్తా, రాకేశ్ కుమార్, పి. ఎస్. శ్రీనివాస్, రాజ్మోహన్, పరశురాం, జి. వెంకటేశ్, షేక్జహంగీర్, భాస్కర్, హనుమంతు, టి. యాదగిరి, యాసిన్, సంతోష్, ఆనంద్, బి.కిరణ్, శ్రీధర్రెడ్డి, సాయి చాణిక్యరెడ్డి, సురేశ్, ప్రభు పాల్గొన్నారు.
నెలకు 20వేల లీటర్ల ఉచిత నీటి పథకం కోసం అధార్ను అనుసంధానం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం వార్డు కార్యాలయంలో దీనికి సంబంధించి అవగాహన కర పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పట్టిన ఈ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకు ఆధార్ అనుసంధానంతో పాటు మీటరు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశం వచ్చేనెల 15వరకు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ డీజీఎం చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ నాయకులు పాల్గొన్నారు.