ముషీరాబాద్, జూన్ 24: భోలక్పూర్ డివిజన్ మల్ల న్న ఆలయ మార్గంలో రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం చేయడం పట్ల ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ఆయన భోలక్పూర్ మల్లికార్జున స్వామి టెంపుల్ రోడ్డు పనులను పరిశీలించారు. పలువురు స్థానికులు రోడ్డు పనులు సాగుతున్న తీరు, డ్రైనేజీ, నీటి లీకేజీపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వెంటనే నీటి లైన్కు మరమ్మతులు చేయాలని, జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జలమండలి జీఎం మహేశ్, డీజీఎం చంద్రశేఖర్, మేనేజర్ ప్రసాద్బాబు, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ సన్నీ, ఏఈ తిరుపతి, టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, భోలక్పూర్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్, శంకర్గౌడ్, మునవర్ చాంద్, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.
రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంగణంలో గురువారం ఎస్తేర్ మెమోరియల్ ప్రేయర్ పవర్ చర్చి ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొవిడ్ బాధితుల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వైద్య శిబిరాన్ని ప్రారంభించి, సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యద్ భక్తియార్, ఆర్.మోజస్, ఎయిర్టెల్ రాజు, శ్రీధర్చారి, అశోక్, శివ, లక్ష్మణ్గౌడ్, భిక్షపతి, బల్ల ప్రశాంత్, ఎర్రం శేఖర్, ముదిగొండ మురళి, చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి: ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం గాంధీనగర్ డివిజన్ బాపునగర్లో రూ.8లక్షల వ్యయంతో స్లాబ్ పనులను కార్పొరేటర్ పావనితో కలిసి ప్రారంభించారు. ముఠా జైసింహ, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్, ఆకుల శ్రీనివాస్, ఎంవీ అశోక్ కుమార్, లక్ష్మీగణపతి ఆలయ చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా శివసింహ, జగదీశ్, రవిశంకర్గుప్తా, ఏఈ శ్రావణి, బీజేపీ నేత వినయ్కుమార్, శ్రీకాంత్, ఆనంద్కుమార్, అరుణ్కుమార్ పాల్గొన్నారు.