ముషీరాబాద్, జూన్ 7: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుతో ఆడపిల్లల తల్లిదండ్రులను ఆదుకుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కల్యాణలక్ష్మి పథకం పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నదన్నారు. సోమవారం ముషీరాబాద్ హెరిటేజ్ ఫంక్షన్హాల్లో కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు కార్పొరేటర్లతో కలిసి అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను పరిశీలించి మరింత మంది అర్హులైన వారికి కల్యాణలక్ష్మి చెక్కులను అందించనున్నట్లు తెలిపారు.
పలు డివిజన్లకు చెందిన 88 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి , షాదిముబారక్ చెక్కులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట ఎన్.సుప్రియా నవీన్గౌడ్, రవికుమార్, సునీతగౌడ్, గౌసుద్దీన్, డిప్యూటీ తాసీల్దార్ చందన, ఆర్ఐలు విజయ్, ఆదిల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, బి.మనోహర్సింగ్, ముఠా పద్మ, సయ్యద్ హమ్మదుల్లా భక్తియారి, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్యామ్సుందర్, ముఠా నరేశ్, బి.శ్రీనివాస్రెడ్డి, మాధవ్, మహమ్మద్ ఖదీర్, జునైద్బొగ్దాది, బీజేపీ నాయకుడు నవీన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి: గోల్కొండ క్రాస్ రోడ్స్లోని హెబ్రోన్ చర్చి వ్యవస్థాపకుడు బ్రదర్ భక్తసింగ్ జయంతిని చర్చి అవరణలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రదర్ భక్త సింగ్ చేసిన సేవలను కొనియాడారు. హెబ్రోన్ చర్చి సొసైటీ చైర్మన్, దైవసేవకులు జోసెఫ్ పి.కురియన్ మాట్లాడుతూ.. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మంచి పరిణామం అన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువనాయకుడు ముఠా జైసింహ, కృపావరం, హెబ్రోన్ చర్చి సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యుల రాగి వీరాచరి, దైవసేవకులు మనోహర్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్: అడిక్మెట్ డివిజన్ విద్యానగర్ మహబూబ్ మసీదు వద్ద ప్రధాన రోడ్డుపై వరద నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని సూచించారు. విద్యానగర్ మసీదు, శ్మశాన వాటిక ఎదుట వరద నీటి సమస్య తీరును పార్టీ నేత సయ్యద్ అస్లాం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అధికారులతో కలిసి విద్యానగర్లో పర్యటించారు. ప్రధాన రోడ్డుపై వరద నీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ సన్నీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అస్లాం, మల్లికార్జున్రెడ్డి, మహ్మద్ ఖదీర్, ఎ.శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.