కవాడిగూడ, జూన్ 4: భోలక్పూర్లో దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైపులైన్ శిథిలావస్థకు చేరుకోవడం వల్ల వాటిని సమూలంగా మార్చేందుకు రూ. 12.5 కోట్లతో కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం భోలక్పూర్ డివిజన్ ప్రాగా టూల్స్ వద్ద మేకల మండి రిజర్వాయర్ నుంచి వచ్చే తాగునీటి పైపులైన్ గ్యాప్ క్లోజింగ్ వర్క్ నిర్మాణ పనులను జలమండలి జీఎం మహేశ్, డీజీఎం చంద్రశేఖర్, సెక్షన్ మేనేజర్ ప్రసాద్బాబులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త పైప్లైన్ నిర్మాణ పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాగా టూల్స్ చౌరస్తా వద్ద పురాతన పైపులైన్ ఉండడం వల్ల కలుషిత నీటి సరఫరా అవుతుందని, ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక వాల్స్ను సహితం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా భోలక్పూర్లో కలుషిత నీటి సరఫరా అధిగమించడంతో పాటు లోప్రెషర్ సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, భోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షుడు బింగి నవీన్, నాయకులు షరీఫుద్ధీన్, జునేద్బాగ్ధాది, ఆర్. శ్రీనివాస్, హర్షవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ: భోలక్పూర్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు కేఎమ్ శంకర్ సతీమణి గీత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం దశదిన కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. శంకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు వై. శ్రీనివాస్ రావు, కేఎమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్: అడిక్మెట్ డివిజన్ అభివృద్ధికి మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ సీనియర్ నేత దివంగత బి.జయరాంరెడ్డి చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం జయరాంరెడ్డి జయంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, సురేందర్ల ఆధ్వర్యంలో రాంనగర్ ఈ సేవా, అచ్చుత్రెడ్డి మార్గ్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు జయరాంరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బి.హేమలతారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్, సురేందర్, మాధవ్, నేత శ్రీనివాస్, మల్లికార్జున్రెడ్డి, సయ్యద్ అస్లాం, ఎ.శ్రీనివాస్, ప్రేమలతారెడ్డి, అనూరాధ, గీతారెడ్డి, రోషం బాలు, జాహంగిర్, మహ్మద్ ఖదీర్, గురుదీప్సింగ్, టైలర్ శ్రీను, శ్రీకాంత్, రింకుసింగ్, సుబ్బారావు, హరీశ్, శ్రావణ్, హమ్మద్ తదితరులు పాల్గొన్నారు.