నేరేడ్మెట్, ఏప్రిల్ 4: మల్కాజిగిరి డివిజన్ మూడుగుళ్ల సమీపంలోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీవిశ్వనాథ్ దేవాలయంలో గురువారం గాలి గోపురం(Galigopuram) నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajashekar Reddy) శంఖుస్థాపన చేశారు. అంతకుముందు దేవాలయంలోని శివుడికి ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రావుల అంజయ్య, బద్దం పరశురాంరెడ్డి, ఉపేందర్రెడ్డి, మేకల రాముయాదవ్, ఆలయ కమిటి చైర్మన్ బియ్యం వెంకట్రావు, వైస్ చైర్మన్ జీఎం రమేష్, కే. వేదవ్రతు, సామల సత్య నారాయణ, గంగాధరికృష్ణ, గణేష్, పీఎస్ శ్రీనివాస్, బాలకృష్ణ, మారెడ్డి రాజశేఖర్రెడ్డి, సాయినారాయణ తదితరులు పాల్గొన్నారు.