మల్కాజిగిరి, డిసెంబర్ 29: చెరువుల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ వద్ద ఉన్న ఎస్టీపీ ప్లాంట్ పనితీరును ఎమ్మెల్యే మర్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఓసీ నుంచి వస్తున్న మురికినీటితో పాటు వరద నీరు రామకృష్ణాపురం చెరువులో కలుస్తుందని, ఇప్పటికే మురుగు నీరు చెరువులో కలువకుండా పైపులైన్ దార్వా కిందకి పంపిస్తున్నామన్నారు. సఫిల్గూడ వద్ద ఉన్న ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మురుగు నీటిని శుద్ధిచేసి బండ చెరువు వైపు మళ్లీస్తున్నామన్నారు. ఇప్పుడున్న ఎస్టీపీ ప్లాంట్ సామర్థ్యాని పెంచడానికి అవకాశం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సీజీఎం సుజాత, జీఎం సునీల్, డీజీఎం నరహరి, మేనేజర్ వేణుగోపాల్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, బద్దం పరశురాంరెడ్డి, మురుగేశ్, అంజయ్య, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.