మల్కాజిగిరి, మార్చి 6: ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన అల్వాల్ సర్కిల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను చూసి కారులోనే కూర్చున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వద్దకు వచ్చి విషయం తెలుసుకోవాలి. అయితే కొద్ది సేపటి తర్వాత కారుదిగి వచ్చిన డీసీకి ఎమ్మెల్యే మర్రి వినతి పత్రం అందజేశారు.
ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారంటూ..ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయానికి ఉదయాన్నే వెళ్లిన డీసీ శ్రీనివాస్ రెడ్డిని ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విధులకు ఆటకం కలుగజేయడంతో పాటు పౌరుష పదజాలాలతో మాట్లాడటంతో పాటు దూషించారని డీసీ ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.