మేడ్చల్ మల్కాజిగిరి,జనవరి1 : పీర్జాదిగూడను మరింత అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు. పీర్జాదిగూడ(Peerjadiguda) మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ ఐఐసీటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్( Community hall), వినాయక మండపాన్ని సోమవారం మేయర్ వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీర్జాదిగూడలో ఇప్పటికే కోట్లాది నిధులతో పలు అభివృద్ధి చేపట్టామని, ఇందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ అబివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, యాసారం మహేశ్వరి మహేశ్, అనంతరెడ్డి, హరిశంకర్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జగదీశ్వర్రెడ్డి, నాయకులు బడారి రవీందర్, శ్రీధర్రెడ్డి, కృష్ణగౌడ్, బండి శ్రీరాములు, జావిద్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.