హైదరాబాద్ : నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ శుక్రవారం పరామర్శించారు. దామోదర్ రావు తండ్రి నారాయణ రావు(92) ఆకస్మిక మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.