వెంగళరావునగర్, ఏప్రిల్ 4 : దశాబ్దాల కల సాకారమైనది. ముప్ఫై ఏండ్లుగా సర్కారు జాగాల్లో నివాసముంటున్న గరీబోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 58, 59 జీవోలతో కష్టాలు గట్టెక్కాయి. పేదల కండ్లల్లో ఆనందం నిండింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ బస్తీల్లో నిరుపేదలు మూడు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని తమ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులకు ఎన్నోసార్లు తాముండే స్థలాలకు పట్టాలివ్వాలని కోరిన పెడచెవిన పెట్టేవారు. ఈ నిరుపేదలను పట్టించుకున్న దాఖలాలు లేవు. బోరబండ,రహ్మత్ నగర్ డివిజన్లలోని వినాయక్ రావు నగర్ , రాజ్ నగర్, అన్నా నగర్, వినయ్ నగర్, రాజీవ్ నగర్, హెచ్ఎఫ్ నగర్ ఫేజ్-2 ఎర్రగడ్డ, వెంగళరావునగర్,యుసుఫ్గూడ డివిజన్లలోని తదితర ప్రాంతాల్లోని పేదలు ఆ సర్కారీ జాగాల్లో ఇండ్లు కట్టుకుని స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటికి రిజిస్ట్రేషన్లు కాని పరిస్థితి. తాముండే ఇంటిస్థలంపై హక్కులు కల్పించాలని పేదలు తమ సమస్యను ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్తో గోడు వెళ్లబోసుకున్నారు. స్థలాలపై హక్కులు కల్పిస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. కాగా ఇండ్లు నిర్మించుకుని నివాసముండే వారికి స్థల పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్రెడ్డి,రాజ్కుమార్ పటేల్,దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, కృష్ణమోహన్,సంతోష్, సంజీవ, జీటీఎస్ దేవాలయం చైర్మన్ చిన్న రమేశ్,నాయకులు విజయ్కుమార్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పండుగ వాతావణంలో రహ్మత్ నగర్ డివిజన్లోని హబీబ్ ఫాతీమానగర్ మల్టీ పర్పస్ కమ్యూనిటీహాల్లో 44 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇండ్ల స్థల పట్టాలు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఇక ముందు కూడా కొనసాగిస్తామ ని..ప్రభుత్వానికి చెందిన 125 గజాల్లోపు స్థలం ఉన్న పేదలందరికీ 58 జీవో కింద పట్టాలు అందజేస్తామ న్నారు. 58, 59 జీవోలను సీఎం కేసీఆర్ తెచ్చి.. పేదల పక్షాన ఉన్నారనే భరోసాను ఇచ్చారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సార్కు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు కృతజ్ఞతలు. ఎన్నాళ్ల నుంచో ప్రభుత్వ స్థలంలో ఉంటున్న మాకు ఇళ్ల ప ట్టాలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మంచి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సహకారం మరువలేం. -నూర్జహాన్,సంజయ్ నగర్
పేదల మనసెరిగిన ప్రభుత్వమిది. సీఎం కేసీఆర్ పే దల పక్షాన నిలబడి మాకు ఇళ్లస్థల పట్టాలు మంజూరు చేయడం సంతోషంగా ఉం ది. ఇన్నేండ్లకు మా కల నెరవేరింది. ప్రభుత్వం ఉచిత రి జిస్ట్రేషన్లు చేస్తుండటంతో.. మాకు పైసా ఖర్చు లేదు. మాకు ఇకనుంచి బ్యాంకు లోన్లు కూడా వస్తాయి. చాలా ఆనందంగా ఉంది.
-సరిత, బీజేఆర్నగర్ నివాసి