వెంగళరావునగర్, జూలై 1: మనసులు ఏకమైతే.. ప్రేమ ఎలాంటి భేదాభిప్రాయాలను, లోటుపాట్లను పట్టించుకోదని మరోమారు రుజువైంది. సామాజిక కట్టుబాట్లను, శారీరక హెచ్చుతగ్గులను తృణప్రాయం చేసి ఓ దళిత యువకుడు, ఓ దివ్యాంగురాలైన యువతి ఏకమయ్యారు. ఈ పెళ్లికి పెద్దలుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్లు వ్యవహరించారు. వీరి సాక్షిగా దివ్యాంగురాలైన యువతిని దళిత యువకుడు వివాహమాడా డు. కోరుకున్నవాడే కళ్యాణమాడేసరికి ఆ యువతి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అయితే, వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన వసుంధర చౌదరి, తెలంగాణ జనగాం జిల్లా అడవికేశపురానికి చెందిన దేవులపల్లి నరేంద్రలు ఇరుగుపొరుగులుగా నగరంలోని వెంగళరావునగర్లో ఏడేళ్లుగా నివాసముంటున్నారు. ఈవెంట్స్ మేనేజర్గా పనిచేసే నరేంద్రకు సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనే వసుంధర చౌదరి పరిచయమైంది. ఒకరి తత్వాలు ఒకరికి నచ్చడంతో పరిచయం కాస్త స్నేహ బంధమైంది. మూడేళ్ల ప్రా యంలోనే వసుంధర పోలియో బారినపడింది. కుమార్తె వసుంధ ర దివ్యాంగురాలు కావడంతో ఆమె తండ్రి ఇల్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇప్పటికీ తండ్రి జా డ లేదు. స్కూలు పిల్లలకు యూనిఫామ్లు కుట్టే కంపెనీని నడిపి, బిడ్డ వసుంధరను ఆమె తల్లి పెంచి పెద్ద చేసింది. అంగ వై కల్యంతో ఉన్నోళ్ల పట్ల ద య చూపొద్దని, వారిలోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రో త్సహించాలంటూ ఆమె చేసే స్ఫూర్తివంతమైన సే వా కార్యక్రమాలు ఆ యువకుడ్ని కదిలించా యి. వసుంధరలోని సేవాతత్పరత చూసి, ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నరేంద్ర.
నరేంద్రకు వసుంధర మనసిచ్చింది. పెళ్లి మాత్రం తల్లిదండ్రుల్ని ఒప్పించాకే చేసుకోవాల నుకున్నారు. వసుంధర ఇంట్లో వారు పెళ్లికి అభ్యంతరం చె ప్పారు. ఊరెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి వస్తానని, వారిని మె ప్పించి పెళ్లి చేసుకుందామని నాలుగేళ్ల క్రితం స్వగ్రామమైన అడవి కేశవపురానికి వెళ్లాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా, నరేంద్రను బంధించారు. ప్రియుడి రాక కోసం నిరీక్షించిన యువతి తన దీనగాదను వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యకు చెప్పగా, దేదీప్య జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే ఇరువైపులా పెద్దలకు నచ్చజెప్పారు. ఎస్సార్ నగర్లోని వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహానికి నరేంద్ర తల్లిదండ్రులు తప్ప, మిగిలిన బంధువులంతా పెళ్లికి వచ్చారు.