కేపీహెచ్బీ కాలనీ, జూలై 8 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆలయాల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కూకట్పల్లి ప్రశాంత్నగర్లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తల్లిదండ్రులు కీశేగోపమ్మ, నరసింహారావు జ్ఞాపకార్థం నిర్మించిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయ ముఖద్వారం(కమాన్)ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో సర్వమతాలకు సమప్రాధాన్యత లభిస్తుందని, అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ కానుకలను అందజేస్తున్నారని కొనియాడారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో పురాతన కాలంనాటి దేవాలయాలన్నింటిని బాగు చేస్తున్నట్లు తెలిపారు. 400 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని అద్భుతంగా పునఃనిర్మించడంతోపాటు మూసాపేటలో లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, ఫతేనగర్లో శివాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రశాంత్నగర్లో ఆలయ కమాన్ను నిర్మించిన కార్పొరేటర్ను అభినందించాడు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోశ్, కార్యదర్శి ప్రభాకర్, ఆలయ కమిటీ కన్వీనర్ శ్రీధర్రావు, మేఘరాజ్ అగ్రావాల్, రామయ్య, వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్, కాలనీవాసులు ఉన్నారు.