కేపీహెచ్బీకాలనీ, మే 15 : కూకట్పల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ పేరుతో ఆక్రమంగా 40వేల ఓట్లను తొలగించారని ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియాతో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ… కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని పలు పొలింగ్ బూత్లలో ఎస్ఆర్ఐ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుట్రతో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు. బూత్ స్థాయిలో తనిఖీలు చేపట్టి ఓట్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.
కేవలం ఫతేనగర్ డివిజన్లోని బూత్ నెంబర్ 351 నుంచి 366 వరకు గౌతంనగర్, మాధవినగర్, నాగార్జున కాలనీ, శోభనకాలనీ, పైప్లైన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో సుమారు 40వేల ఓట్లను తొలగించారన్నారు. తొలగించిన ఓట్లకు సంబంధించిన ఆధారాలతో కూకట్పల్లి జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావును కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఇబ్బందులు పెడుతున్నదని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.