కేపీహెచ్బీ కాలనీ, జూలై 18 : పేదింటి ఆడపిల్ల పెం డ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నలా అండగా నిలబడి ఆదుకుంటున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 161 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు అందజేశారు. అల్లాపూర్ డివిజన్కు చెందిన 63 మంది, కేపీహెచ్బీ కాలనీ డివిజన్కు చెందిన 25 మంది, కూకట్పల్లి డి విజన్కు చెందిన 26 మంది, మూసాపేట డివిజన్కు చెం దిన 34 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా విపత్తులో సైతం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శిరీషాబాబురావు, సబీహాబేగం, మాజీ కార్పొరేటర్లు తూము శ్రవణ్కుమార్, పగుడాల బాబురావు తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం పరిశీలించనున్నారు. ఉదయం 8 గంటలకు కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నం.5లో, ముళ్లకత్వ, మైసమ్మ, సున్నం చెరువు పరిశీలన, బోయిన్పల్లి డివిజన్లోని కలింగ ఎన్క్లేవ్లో డ్రైనేజీ సమస్య, ముస్లిం శ్మశానవాటిక, హరిజన బస్తీ అంజయ్యనగర్లో స్థానిక ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకోనున్నారు. ఆయా కాలనీల ప్రజలు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను విన్నవించాలని తెలిపారు.