కేపీహెచ్బీ కాలనీ, మార్చి 31 : బీఆర్ఎస్తోనే(BRS) అభివృద్ధి సాధ్యమని, మల్కాజగిరి అభివృద్ధి కోసం రాగిడి లక్ష్మారెడ్డిని(Ragidi Lakshmareddy) గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishnarao) అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లోని పీవీఎన్ఆర్ పార్కు, అంబేద్కర్ పార్కులో ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందన్నారు. నగరంలోని కాలనీలు, బస్తీలలో సమస్యలన్నింటినీ పరిష్కరించామని మెరుగైన మౌలిక వసతుల కల్పన వల్లే నగరం శరవేగంగా అభివృద్ధిని సాధించిందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కులను ఆదర్శవంతంగా అభివృద్ధి చేశామని.. చేసిన అభివృద్ధి కండ్లముందు కనబడుతుందన్నారు.
గత ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించడం వల్లే ఎమ్మెల్యేగా విజయం సాధించానని, మరోమారు బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాలనీలు, బస్తీలలో సమస్యలను పరిష్కరించేంపదకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, అసోసియేషన్ నేతలు ఉన్నారు.