దుండిగల్, మార్చి30: మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
గాజులరామారం డివిజన్ (125) ఆక్సిజన్ పార్క్, ఉషోదయ కాలనీలో శనివారం రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వివేకానంద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు విజయరాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్రాజ్, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.