కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి13: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. అసెంబ్లీలో ఆయా వర్గాలకు చెందిన సమస్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శాలువలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఆకాంక్షను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వడ్డెర సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువలతో సత్కరించి కృతజ్ఞతలు తెలుపుతూ తమ సమస్య పరిష్కారానికి మొదటిసారిగా అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, అధ్యక్షుడు నారాయణస్వామి, మహిళా అధ్యక్షురాలు తిరుమల దేవి, కార్యదర్శి గుంజ శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, కార్యదర్శి గణేశ్, నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ గాగిళ్లాపూర్లో బస్తీదవాఖాన ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను గాగిళ్లాపూర్వాసులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సంజీవరెడ్డి, కుంటి మురళి, సి.మురళి, సి.పరంధామ, సి.దామోదర్, సి.అరుణ్ పాల్గొన్నారు.
ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆర్టీసీలో ఒకే బస్పాస్పై దివ్యాంగులు అన్నీ సర్వీసుల్లో ప్రయాణించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోషియేషన్ డిజేబు అధ్యక్షులు అంజయ్యగౌడ్, కార్యదర్శి నరేందర్రెడ్డి, ఉపాధ్యక్షులు సత్యం, యాదయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను వినతిపత్రం రూపంలో ఇచ్చారు. దీంతో సంబంధిత అధికారులకు ఫోన్లైన్లో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.