కుత్బుల్లాపూర్, మే 30: ఎన్నికల వేళ ప్రతిపక్షాల జిత్తులమారి వేశాలతో ప్రజల ముందుకొస్తున్నారు. వారి అసత్య ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మంగళవారం కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సురేందర్రెడ్డిగార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నేత కేఎం గౌరీశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కరోనా, భారీ వరదల సమయంలో ప్రజల ముందుకు రాని విపక్ష నాయకులంతా ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి మభ్యపెట్టేందుకు వస్తారని, వారికి రాబోయే రోజుల్లో సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు. గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణను నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధి చేసి చూపిందన్నారు. ఇంత చేస్తున్నా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పి రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
అలాగే జీడిమెట్లలోని సరో జినీ గార్డెన్లో జరిగిన డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్రావు, మాజీ కౌన్సిలర్ కిషన్రావు, సూర్యప్రభ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంపత్మాధవరెడ్డి, కిశోర్చారి, నార్లకంటి బాలయ్య, సురేందర్రెడ్డి, అరుణ, చిలుక సతీశ్, జయంచారి, సిద్ధయ్య, అరుణ్, నజీర్, సత్యవతి, మధుకర్రెడ్డి, వెంకటేశ్, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.