కాచిగూడ,మార్చి 16: పార్కుల సుందరీకరణకు ప్రభు త్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. బర్కత్పురలోని విక్రంనగర్ పార్క్ అభివృద్ధి పనులను రూ.80లక్షలతో బుధవారంకాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే వెంకటేశ్ ప్రారంభించారు.అనంతరం అధికారులతో పర్యటించి పార్కులోని సమస్యలను స్వయంగా వాకర్స్ను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కు ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని,వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అదే విధంగా సందర్శకుల కోసం పార్కు గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, చుట్టుపక్కల మొక్కలు, ఫుట్పాత్లపై బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కులను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. విక్రంనగర్ పార్కులో సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని, పచ్చదనాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పార్కుల్లో మొక్కలు నాటి రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ప్లోర్లీడర్, టీఆర్ఎస్ నాయకుడు రాంబాబు, రమేశ్యాదవ్,డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్, ఓం ప్రకాశ్యాదవ్, దాత్రిక్ నాగేందర్బాబ్జి, శ్రీనివాస్యాదవ్, సంతోశ్కుమార్, సుభాశ్పటేల్, రమాదేవి, మల్లికార్జున్, ఎం.నర్సింగ్రావు,హజరిబాబు, బల్వీర్,సునీల్, రాము, సీతారామ్, భీంరాజ్, బాలప్రసాద్, మురళి,రవియాదవ్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్,ఏఈ ప్రేరణ, సంప త్, తదితరులు పాల్గొన్నారు.