అంబర్పేట/ గోల్నాక, అక్టోబర్ 17 : సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ భవితకు భరోసాను ఇచ్చేలా ఉందని అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని రెడ్బిల్డింగ్ వద్ద డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సామాన్యుడికి లబ్ధి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రవేశపెట్టారని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన మ్యానిఫెస్టో ఇదీ అని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాకు విజయం చేకూర్చనున్నదన్నారు.
తొమ్మిదిన్నరేండ్లలో ఇచ్చిన హామీలు అమలు చేసి ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను వంద శాతం అమలు చేస్తాడని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. సౌభాగ్యలక్ష్మి పథక కింద అర్హులైన మహిళలకు మూడువేల రూపాయల గౌరవ వేతనం, దివ్యాంగులకు పింఛన్ పెం పు, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యమే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలను మ్యానిఫెస్టోలో పెట్టారని తెలిపారు. మరోమారు కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టగానే ప్రకటించిన పథకాలన్నీ అమల్లోకి వస్తాయన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తన ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికీ వెళ్లి ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వ, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ప్రజలకు తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో ప్రభు త్వం అందించిన సంక్షేమ పాలనకు బీఆర్ఎస్ అభ్యర్థికి బస్తీల్లో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది ప్రజలకు తెలియజేస్తున్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే అంబర్పేటను మరింత అభివృద్ధి చేస్తానని , కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మంగళవారం అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకొన్న అనంత రం బుర్జుగల్లి, చుట్టు పక్కల ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బస్తీలో ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలుకరించి సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను వారికి వివరించారు. మళ్లీ కేసీఆర్ను సీఎం చేయాలని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
మున్సిపల్ కాలనీలో మౌలిక వసతుల కల్పంచి అభివృద్ధి చేశామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్పేట డివిజన్ మున్సిపల్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆ యన పర్యటించారు. అనంతరం కాలనీ మహిళలతో ఆయన భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత నాలుగున్నరేండ్ల తన పాలనలో నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపట్టామని తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ఆయన వివరించారు. ముఖ్యంగా నిరుపేద మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి నెలా రూ.3వేల జీవన భృతి, అర్హులైన మహిళలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ వంటి ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలతో పాటు డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.