అంబర్పేట, మార్చి 16: అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ భరత్నగర్లో రూ.10.70 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భరత్నగర్లో కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్య ఉందని, ఈ విషయాన్ని స్థానిక బస్తీ నాయకులు తన దృష్టికి తీసుకురావడంతో ప్రత్యేకగా నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు బస్తీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు.
డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు, పార్కుల వంటి అభివృద్ధి పనులే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్వర్క్స్ డీజీఎం విష్ణువర్ధన్రావు, ఏఈ మాజిద్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రవి, ఎస్సై శైలజ, బీఆర్ఎస్ పార్టీ బాగ్అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు ఇ.ఎస్.ధనుంజయ, కనివేట నర్సింగ్రావు, రమేష్నాయక్, కెంచె మహేష్, మిర్యాల రవీందర్, జ్ఞానేశ్వర్, దారయోబు, శివాజీయాదవ్, శివ, లక్ష్మణ్, శ్రీనివాస్యాదవ్, బీజేపీ నాయకులు ఇ.అజయ్కుమార్, రోహిత్గౌడ్, శేఖర్, శ్రీహరి, మిర్యాల శ్రీనివాస్, బాలు, శివ తదితరులు పాల్గొన్నారు.