కాచిగూడ/గోల్నాక, ఫిబ్రవరి 1: బాగ్అంబర్పేట డివిజన్ నందనవనంలో రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందు లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే స్థానికంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గాయత్రి టవర్ నుంచి వైభవ్నగర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పార్కును అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అలాగే వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వైభవ్నగర్ పార్కును రూ.75 లక్షలతో సుందరంగా తయారు చేస్తున్నామని, శనివారం పనులకు శంకుస్థాపన చేద్దామని తెలిపారు.
గాయత్రి టవర్ నుంచి కాలనీ లోపలకు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గాయత్రి టవర్ దగ్గర రోడ్డు నిర్మాణం పూర్తయితే కొన్నేండ్లుగా ఉన్న వరద నీరు నిలిచే సమస్య పరిష్కారమవుతుందని వెల్లడించారు. వైభవ్నగర్లో ఏర్పడే వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాలనీ వాసులు ఒక ఆలోచనకు వస్తే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రవి, కాలనీ ప్రతినిధులు డాక్టర్ చారి, డా.మధుసూదన్రెడ్డి, సిద్ధార్థ్, వేణుగోపాల్ అగర్వాల్, నాయకులు రమేశ్నాయక్, గణేశ్, బి. నర్సింగ్రావుయాదవ్, నందనవనం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చొరవతోనే ఎస్బీహెచ్ కాలనీ అభివృద్ధి ..
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చొరవతోనే బాగ్అంబర్పేట డివిజన్ ఎస్బీహెచ్ కాలనీ అభివృద్ధి చెందిందని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ప్రతినిధి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు భారతిరెడ్డి అన్నారు. బుధవారం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతిరెడ్డితో పాటు కాలనీ అసోసియేషన్ మహిళా విభా గం ప్రతినిధులు అద్దంకి విమల, పాల సరస్వతి, పసుమర్తి బాలత్రిపుర సుంద రి, బత్తుల జగదాంబ, హెచ్.సౌమిత్రి, ఎన్.హరిప్రియ, వి.సునీతరెడ్డి, శాంత, రాజేశ్వరి, తేజావత్ కృష్ణకుమారి తదితరులు మాట్లాడారు.
కాలనీ పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు తయారు చేసి నిధులు మంజూరుకు పంపించారని చెప్పారు. పారిశుధ్య సమస్య పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. అప్పుడప్పుడు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండగా, ఆ సమస్యను కూడా పరిష్కరించారన్నారు. అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా కాలనీ అభివృద్ధిని ఇతరులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవని, ఎమ్మెల్యేగా కాలేరు వెంకటేశ్ వచ్చిన తరువాత కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు.
వీరన్న గుట్ట శివాలయంలో భీష్మ ఏకాదశి పూజలు..
భీష్మ ఏకాదశి పూజలు బుధవారం గోల్నాక డివిజన్ వీరన్న గుట్ట శివాలయంలో అంబర్పేట గంగ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ భీష్మ ఏకాదశి ఉత్సవాలతో పాటు గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథులుగా అంబర్పేట, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కార్పొరేటర్లు వి.విజయ్కుమార్గౌడ్, దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు గులాబ్ శ్రీనివాస్, మెట్టు ధన్రాజ్, గడ్డం సాయికిరణ్, శ్యామ్సుందర్, మైలారం రాజు, యశ్వంత్, శ్రీనివాస్, యాదగిరి, స్వరూప, సింగీతం సాయి తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా ఇటీవల పద వీ బాధ్యతలు చేపట్టిన ఎస్కే సలీమా బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, పీసీఎస్ ఆర్పీఎఫ్ రాజరాం, సీఎస్సీ ఆర్పీఎఫ్ ఆర్ఎస్పీ సింగ్, సికింద్రాబాద్ డివిజనల్ ఆర్పీఎఫ్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ ఛటోపాధ్యాయ బెనర్జీలను మర్యాద పూర్వకంగా కలిశారు.
-మారేడ్పల్లి, ఫిబ్రవరి 1